సతీసమేతుడై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మూడు రోజుల భారత పర్యటనకు ముంబయి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. పాక్ ప్రస్తావన లేకుండానే ఉగ్రవాదంపై కళ్ళురిమారు. 26/11 ఉగ్రవాద బాధితులకు నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శమని ప్రవచించారు. అమెరికా భారత్ పరస్పర సహకారంపై తమదైన శైలిలో చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పారు. ఉభయదేశాల మధ్య 44వేల కోట్లరూపాయలకు చేరిన వాణిజ్య బంధం మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. భారత్తో కుదిరిన వ్యాపారబంధంతో తమ దేశంలో 50 వేల ఉద్యోగాలకు కల్పిస్తామని అన్నారు.
నంబర్ వన్ భాగస్వామి ఎందుకు కాలేదు?
‘భారతదేశం మాతో వ్యాపారరంగంలో నంబర్ వన్ భాగస్వామి ఎందుకు కాలేకపోతోందో తెలీడంలేదు. అందుకు ఏ కారణమూ లేదు. (ఇప్పుడు అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో ఇండియా 12వ స్థానంలో ఉంది. ఆ స్థానం మారడం లేదు), ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు 21వ శతాబ్దంలోనే ఆదర్శ భాగస్వామ్యానికి నిర్వచనంగా నిలుస్తాయన్న నమ్మకం నాకుంది’ అని బరాక్ ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి మూడు రోజుల భారత్ పర్యటనకు వచ్చిన ఒబామా యూఎస్ ఇండియా బిజినెస్ కౌన్సిల్ (యూఎస్ఐబిసి) సమావేశంలో ప్రసంగించారు. ‘నేను ఇక్కడికి రావడానికి కొద్దిరోజుల కిందట అనేక కీలక లావాదేవీలు జరిగాయి. ఇండియాకు డజన్ల కొద్దీ విమానాల్ని అమ్మేందుకు బోయింగ్ సంస్థ సంసిద్ధత తెలిపింది. జిఇ కంపెనీ వందలాది ఎలక్ట్రిక్ ఇంజన్లను అమ్ముతుంది. ఈ లావాదేవీల విలువ పది బిలియన్ డాలర్లు...అంటే రూ 44 వేల కోట్లు. అలాగే అమెరికాలో 50 వేలకు పైగా ఉద్యోగాల్ని కల్పిస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు.రిలయెన్స్ పవర్ ప్రకటన
మరింతగా పెట్టుబడులు
ఈ రెండు ఒప్పందాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ ఒబామా - ‘ఇండియా సామర్థ్యాన్ని ఈ రెండు ఒప్పందాలూ చాటిచెబుతున్నాయి. భవిష్యత్తు మార్కెట్ ఇండియాదే. మార్కెట్ అస్థిరత, టారిఫ్ల వంటి అవరోధాలపట్ల జాగ్రత్త వహిస్తే అమెరికా తన పెట్టుబడులు పెంచేందుకు సిద్ధంగా ఉంది’ అని ఒబామా హామీ ఇచ్చారు. ఎగుమతులపై నిబంధనల్ని సడలిస్తే డిఆర్డిఓ, ఇస్రో వంటి భారతదేశ వ్యవస్థల ప్రవేశాన్ని సాంకేతికంగా తిరస్కరించడానికి తెరపడుతుందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.మహాత్ముడు ప్రపంచానికే హీరో
మహాత్ముడు బొంబాయి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారు. మహాత్ముడి స్మారకచిహ్నాన్ని చూసిన అనుభూతిని తను ఎప్పటికీ మనసులో పదిలపరుచుకుంటానని ఒబామా భార్య మిచెల్లీ చెప్పారు. ఈ పర్యటనను తను ఒక అమూల్యమైన నిధిగా భావిస్తున్నానని అన్నారు. ‘గాంధీజీ జీవితం, బోధనల గురించి ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలకు చెప్పాలి’ అని మిచెల్లీ సందర్శకుల పుస్తకంలో రాశారు. మణిభవన్ను ఇప్పుడు గాంధీ మ్యూజియంగా మార్చారు.
3 రోజుల పర్యటన 18 ప్రకటనలు
శనివారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 50 నిముషాలకు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ అమెరికా వైమానిక దళం విమానం నుంచి భారతభూమిపై కాలు మోపారు. ఆయన వెంట మంత్రివర్గ సహచరులు, నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ ( ఎన్ఎస్ఏ) టాం డోనిలన్, 200 మంది అమెరికా వ్యాపారవేత్తలు వచ్చారు. అమెరికా అధ్యక్షుడి వెంట వివిధ రంగాలకు చెందినవారు ఇంత పెద్ద సంఖ్యలో రావడం ఇదే మొదటిసారి.
సాదర స్వాగతం
సంబంధాలు మెరుగైనాయి
ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంతో అమెరికా సంబంధాలు నాటకీయంగా మెరుగయ్యాయని అమెరికా ఉప విదేశాంగ మంత్రి విలియం బర్న్స చెప్పారు. 2008 నుంచి ఇండియాతో 400 కోట్ల డాలర్ల విలువైన రక్షణపరమైన అమ్మకాలు జరిగాయని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ అభివృద్ధికి ఇండియా 130 కోట్ల డాలర్ల సాయం అందించడాన్ని ఆయన ప్రశంసించారు. ‘భారత్ పాకిస్తాన్లు వివిధ అంశాలపై చర్చించుకోవాలని మేం పదేపదే కోరుకుంటున్నామన్నారు.వీధి బాలలతో మిచెల్లీ ఆటాపాటా
కష్టపడి పనిచేయడం, చదువుకోవడం, ధైర్యంగా ఉండడం జీవితంలో చాలా ముఖ్యం. నేను చాలా కష్టపడి చదువుకున్నాను. అమెరికాకు ప్రథమ మహిళ అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు.కానీ నాకా అవకాశం వచ్చింది. అది చదువు వల్లే వచ్చింది. చదువుకుంటే మీరూ జీవితంలో విజయం సాధించగలరు’ మిచెల్లీ ఆ వీధి బాలలకు చెప్పారు. ఒక ఎన్జిఓ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో వైవిధ్యభరితంగా సాగింది.
ఒబామా.. వ్యాపార పర్యటన షురూ
అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒబామాకు ఎదురుగాలి వీచింది. వృద్ధి రేటు కుంటుపడింది. నిరుద్యోగం రేటు పెరిగిపోయింది. దీంతో అమెరికాలో తగ్గిన తన పలుకు బడిని పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అమెరికన్ కంపెనీలు భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని అన్నారు.
ఆయన భారత్ గడ్డపై కాలు మోపగానే ఆశ్చర్యకరంగా పలు ఒప్పందాలు జరిగిపోయాయి. వాటిలో స్పయిస్జెట్ చౌక రకం విమానయానసంస్థ బోయింగ్తో కమర్షియల్ విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. జనరల్ ఎలక్ట్రిక్తో అడ్వాన్స్ జెట్ ఇంజన్ ఒప్పందం జరిగిపో యాయి. బోయింగ్ డజన్ల కొద్ది విమానాలు విక్రయి స్తుంది. జీఈ 100 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్ ఇంజన్లు అందజేస్తుందని అన్నారు. ఆయన రాకముందే సుమారు 10 బిలియన్ డాలర్లు (రూ.44,000) కోట్ల ఒప్పందాలు జరిగిపోయాయి.
అమెరికా భారత్ బిజినెస్ కౌన్సిల్లో మాట్లాడుతూ ఒబామా అమెరికాలో ఎగుమతుల్లో భారత్ వాటా కేవంల 2 శాతమేనని అన్నారు.
ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఒబామా అన్నారు. ఎగుమతుల నిబంధనలు సరళీకరించి టెక్నాలజీ రంగాల్లో కూడా పరస్పరం సహకరించు కోవాలని ఉదాహరణకు డీఆర్డీఓ, ఇస్రోకు కావాల్సిన సాంకేతికపరంగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆయన చెప్పారు. భారత్ - అమెరికా వాణిజ్యం 2009-10 ఆర్థిక సంవత్సరంలో 36.5 బిలియన్ డాలర్లని, ఇరు దేశాలు ప్రస్తుతం ఉన్న వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో రెండింతలు చేయాలని ఒబామా అన్నారు. భారత్ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 8 శాతం అమెరికా నుంచి పొందుతుందని, 21వ శతాబ్దంలో భారత్ తమ భాగస్వామి అన్నారు. వ్యవసాయ రంగంలో అమెరికా భారత్కు ఎంతో సహకరించిందని, అలాగే భారత్ కూడా అమెరికాకు పలు రంగాల్లో సహకరించిందన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం భారత్ అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుపోతుందని భారత్ గత రెండు దశాబ్దాల కాలంలో ఈ పురోగతిని సాధించిందని ఆయన ప్రశంసించారు. లైనెన్స్ రాజ్కు స్వస్తి పలికి, బహిరంగ మార్కెట్ విధానాన్ని భారత్ తెరలేపిందన్నారు.
ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారత్లో మధ్యతరగతి ఉందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో భారత్ అమెరికాలో మరింత మెరుగైన వాణిజ్యం చేస్తుందని నమ్మకం ఉందన్నారు. త్వరలోనే భారత్ తమ వాణిజ్య భాగస్వామి అవుతుందని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment