Tuesday, November 30, 2010

లాబీయింగ్ రారాణి..నీరా!

నీరా పుట్టింది ఒక పంజాబీ కుటుంబంలో. ఆమె తండ్రి శర్మ కెన్యాలో విమాన విడి భాగాలు సరఫరా చేసే కంపెనీకి ఏజెంట్‌గా వ్యవహరించేవారు. దీని వల్ల ఆమెకు విమానయాన సంస్థలకు సంబంధించిన అంశాలపై చిన్నప్పుడే ఆసక్తి ఏర్పడింది. 1970లలో శర్మ కుటుంబం కెన్యా నుంచి లండన్‌కు తరలివెళ్లింది. దీనితో నీరా విద్యాభ్యాసమంతా లండన్‌లోనే జరిగింది. ఆమెకు ఇంగ్లండ్ పౌరసత్వం కూడా లభించింది. లండన్‌లోని హార్బర్‌డేషర్స్ అనే స్కూలులో చదువుకున్న నీరా- చిన్నప్పుడు చాలా చలాకీగా ఉండేది. హైస్కూలు పూర్తయిన తర్వాత నీరా వార్విక్ విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పుచ్చుకుంది. డిగ్రీ పూర్తయిన కొద్ది కాలానికి లండన్‌కు చెందిన జనక్ రాడియాతో ఆమెకు వివాహమైంది. ముగ్గురు మగ పిల్లలు కూడా పుట్టారు. ఆ తర్వాత జనక్-నీరాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీనితో విడాకులు తీసుకొని నీరా 1995లో భారత్‌కు వచ్చేసింది.

ఒక్కో మెట్టు ఎక్కుతూ...
నీరా వచ్చేనాటికి మన దేశంలోని కంపెనీలకు మీడియా రిలేషన్స్ చూసేందుకు ప్రత్యేకమైన సంస్థలు ఉండేవి కావు. కంపెనీలలో ఉండే కొందరు మేనేజర్లకే ఈ బాధ్యతను అప్పగించేవారు. అయితే భవిష్యత్తులో పబ్లిక్ రిలేషన్ సంస్థలకు మంచి అవకాశాలు ఉంటాయని నీరా ముందే పసిగట్టింది. తనకు చిన్నప్పటి నుంచి ఆసక్తి ఉన్న వైమానిక రంగం కూడా భారత్‌లో దిన దిన ప్రవర్థమానమవుతుందని భావించింది. ఈ రంగంలో అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే ముందు వైమానిక రంగంలో లోతుపాతులు బాగా తెలియాలి కాబట్టి -సహారా ఎయిర్‌లైన్స్‌లో పబ్లిక్ రిలేషన్స్ అధికారిగా చేరింది నీరా. కొద్దికాలం తర్వాత ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి- సింగపూర్ ఎయిర్‌లైన్స్, కేఎల్ఎం, యూకే ఎయిర్ వంటి విమానయాన సంస్థలకు భారత ప్రతినిధిగా వ్యవహరించటం మొదలుపెట్టింది. ఈ సంస్థలతో ఉన్న అనుబంధం, అనుభవంతో- 2000 సంవత్సరంలో క్రౌన్ ఎయిర్ అనే ప్రైవేట్ విమాన సంస్థను ప్రారంభించటానికి ప్రయత్నించింది.

వంద కోట్ల రూపాయల మూలధనంతో ప్రారంభమైన ఈ సంస్థకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇదే సమయంలో నీరా వైష్ణవి కమ్యూనికేషన్స్‌ను స్థాపించింది. అప్పటి హర్యానా ముఖ్యమంత్రి రావు బీరేంద్రసింగ్ మనమడు ధీరజ్ సింగ్ కూడా ఆ సంస్థలో భాగస్వామి. అయితే విభేదాలు రావటంతో నీరా కుమారుడు కరణ్‌ను ధీరజ్‌సింగ్ కిడ్నాప్ చేశాడు. 2003లో ఈ సంఘటన ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సంఘటన వల్ల నీరాకు ఉన్నతస్థాయిలో ఉన్న సంబంధాలు తొలిసారి బయటకు తెలిసాయి. అంతే కాకుండా- రాజకీయంగా అనేక మంది నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్న ధీరజ్‌సింగ్ కిడ్నాప్ కేసులో శిక్షను అనుభవించాల్సి వచ్చింది. ఈ కేసులో ధీరజ్ తప్పించుకొని పోకుండా నీరా శిక్ష పడేదాకా పోరాడిందని సన్నిహితులు చెబుత ారు.

రాజకీయ నాయకులతో..
నీరా ఢిల్లీలో స్థిరపడిన తర్వాత ఆమెకు అనేక మంది రాజకీయ నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ముఖ్యంగా ఎన్‌డీఏ హయాంలో పౌరవిమానయాన శాఖ మంత్రిగా వ్యవహరించిన అనంత్‌కుమార్‌కు నీరా సన్నిహితురాలు. ఎన్‌డీఏ హయాంలో ఆమెకు అనేకమంది రాజకీయ నాయకులతోను, జర్నలిస్టులతోను సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఛాతర్‌పూర్‌లో నీరా ఇచ్చే పార్టీలకు అనేక మంది నేతలు, జర్నలిస్టులు హాజరయ్యేవారని చెబుతారు. 2001లో వైష్ణవి కమ్యూనికేషన్స్‌కు టాటా సంస్థల కార్పొరేట్ కమ్యూనికేషన్స్ వ్యవహారాలు చూసే కాంట్రాక్టు లభించింది. టాటా సన్స్‌లో ఉన్న మొత్తం 90 కంపెనీల మీడియా వ్యవహారాలు చూడటం మొదలుపెట్టిన తర్వాత నీరా హవా మరింతగా పెరిగింది.

ప్రభుత్వాలు మారినా...
2004లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ ఓటమి పాలయింది. యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మారిన సమీకరణాల నేపథ్యంలో నీరా కొత్త స్నేహితులను ఎంపిక చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలోనే- ఆమె యూపీఏలోని వివిధ పార్టీల నేతలతో సన్నిహిత సంబంధాలు ఏర్పరుచుకుంది. డీఎంకేలో కీలకమైన పాత్ర పోషించే మాజీ కేంద్ర మంత్రి రాజా కూడా ఆమెకు అదే సమయంలో పరిచయమయ్యారు. యూపీఏ సర్కారు అనుసరిస్తున్న టెలికం విధానాల ద్వారా తన క్లయింట్స్‌కు లాభం చేకూర్చటానికి నీరా ప్రయత్నాలు ప్రారంభించింది. టెలికం రంగంలో టాటాలకు ప్రత్యర్థి అయిన ఎయిర్‌టెల్ అధినేత సునీల్ మిట్టల్‌కు వ్యతిరేకంగా నీరా చేసిన లాబియింగ్ ఫలించింది.

2007 నాటికి అంబానీ బ్రదర్స్ మధ్య నెలకొన్న ప్రచ్ఛన్న యుద్ధం పతాకస్థాయికి చేరుకుంది. టెలికం రంగంలో టాటాకు ప్రత్యర్థి అయిన అనీల్‌కు వ్యతిరేకంగా నీరా పావులు కదిపింది. శత్రువు శత్రువు మిత్రుడనే నానుడిని అనుసరించి - అనీల్‌కు వ్యతిరేకంగా ముకేష్, రతన్‌టాటాలను కలపటంలో నీరా విజయం సాధించింది. దీనికి ప్రతిఫలంగా- ముకేష్ అంబానీ పబ్లిక్ రిలేషన్స్ చూసే అవకాశం నీరాకు లభించిందని చెబుతారు. దీని కోసమే ఆమె వైష్ణవి కమ్యూనికేషన్స్‌కు సోదర సంస్థగా న్యూకామ్‌ను నెలకొల్పింది.

మన దేశంలో లాబీయింగ్ చేసే పురుషులు అనేక మంది కనిపిస్తారు. మహిళలు ఈ రంగంలో చక్రం తిప్పటం చాలా అరుదైన విషయం. 2జీ స్పెక్ట్రమ్ కుంభకోణంలో నీరాకు శిక్షపడుతుందా? లేకపోతే తప్పించుకుంటుందా అనే విషయం కాలమే నిర్ణయించాలి.

Monday, November 22, 2010

"Life is a matter of habit " Dr. S. Radhakrishnan


IT’S ATTITUDE, ULTIMATELY
Dr. S. Radhakrishnan, the great philosopher and former President of India , made his first visit to the United States when John F. Kennedy was the President. The weather was dark and stormy in Washington and when Dr. Radhakrishnan alighted from the plane, it began to pour cats and dogs, as the expression goes.
The young American President greeted his Indian counterpart with a warm hand­shake and a smile. "I'm so sorry we have such bad weather during your visit," he remarked courteously. The philosopher-statesman smiled. "We can't change bad things, Mr. President," he observed. "But we can change our attitude to them."
A few years ago I was in Delhi , I was invited by Doordarshan to visit their studios. There I met a wonderful man. He had lost both his arms in an accident. But he had a positive attitude. He trained his feet so that he could take up the job of composing in a press. With a smile on his face and a feeling of joy, he said, "I earn Rs. 500 a month. I am not a burden on anyone."
There was another man whom I met in Pune. He was sitting by the wayside, and he had no legs, only stumps beneath his hips.
"What happened to you?" I asked him.
"Nothing!" he replied. "I was born this way."
"May I ask, who takes care of you, my friend?" I enquired.
"My mother - and above all, God."
"Do you find it difficult, inconvenient to move about?"
"Do you find it difficult and inconvenient that you don't have wings?" he asked me. "Don't you think it would be far better if you could fly on your own, rather than wait to catch a plane?"
"Life is a matter of habit," he added. "If you start complaining, there is so much to complain about. It is the attitude that counts.”

Friday, November 19, 2010

వహ్వా..! థిరక్వా... తబలా

ఎందరో తబలా విద్వాంసులు తమ తమ బాణీల్లో అద్భుతంగా వాయిస్తారు కాని థిరక్వా శైలిలో ఒక ప్రత్యేకమెన పరిపూర్ణత, గాంభీర్యం, నిండుతనం ఉండేవి. దశాబ్దాలుగా, ఆరేడు తరాల సంగీతజ్ఞులతో తలపండిన అనుభవం, మారుతున్న అభిరుచులతో రాజీలేని శాస్ర్తీయ ధోరణి, శాశ్వతమెన విలువలని ప్రతిబింబించే సంగీత వైఖరి ఇలాంటి లక్షణాలన్నీ ఆ నాటి కచేరీలో కనిపించారు.

thirakwa21975లో అప్పటి బొంబాయిలోని తేజ్‌పాల్‌ ఆడిటోరియంలో బడేగులాం అలీఖాన్‌ వర్ధంతి సభలో హిందూస్తానీ సంగీత కచేరీలు జరిగాయి. అందులో ఉస్తాద్‌ అహ్మద్‌జాన్‌ థిరక్వా తబలా సోలో కచేరీ జరిగింది. అప్పుడాయన వయస్సు 97 సంవత్సరాలు. సన్నగా, పొడుగ్గా, పొడుగాటి అచ్‌కన్‌ కోటు తొడుక్కుని, పైజమా, తలమీద టోపీతో ఇద్దరు నడిపించుకురాగా వయోవృద్ధుడెన ఉస్తాద్‌ నెమ్మదిగా స్టేజిమీద కూర్చున్నారు. మొదట్లో తన రెండు చేతులూ అతి కష్టం మీద తబలా, డగ్గాల మీదికి చేర్చినట్టు అనిపించినా, ఆ తరవాత విలంబిత్‌ తీన్‌తాల్‌లో తబలా విన్యాసం సునాయాసంగా మొదలయింది. పాత సంప్రదాయాన్ని అనుసరించి వాయిస్తున్నప్పుడు మధ్యలో కొనుగోలు పద్ధతిలో ఆయన బోల్‌లు నోటితో పలికి వినిపించారు.

ఎందరో తబలా విద్వాంసులు తమ తమ బాణీల్లో అద్భుతంగా వాయిస్తారు కాని థిరక్వా శైలిలో ఒక ప్రత్యేకమెన పరిపూర్ణత, గాంభీర్యం, నిండుతనం ఉండేవి. దశాబ్దాలుగా, ఆరేడు తరాల సంగీతజ్ఞులతో తలపండిన అనుభవం, మారుతున్న అభిరుచులతో రాజీలేని శాస్ర్తీయ ధోరణి, శాశ్వతమెన విలువలని ప్రతిబింబించే సంగీత వైఖరి ఇలాంటి లక్షణాలన్నీ ఆ నాటి కచేరీలో కనిపించాయి. దశాబ్దాల క్రితమే కాలంచేసిన మహోన్నత గాయకు లెందరికో పక్క వాయిద్యం వాయించిన థిరక్వాను కళ్ళారా చూసి, ఆయన తబలా వినగలిగినందుకు ప్రేక్షకులందరూ థ్రిల్‌ అయారు. కచేరీ తరవాత ఆటోగ్రాఫ్‌ చేస్తున్నప్పుడు ఆయన చెయ్యి చాలా వణికిందిగానీ తబలా వాయిస్తున్నప్పుడు మాత్రం ముసలితనం అడ్డురాలేదు.

thirakwa1ఉత్తర్‌ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో సంగీతకారుల కుటుంబంలో జన్మించిన థిరక్వా మొదట్లో ఉస్తాద్‌ మిఠ్ఠూఖాన్‌ వద్ద గాత్రసంగీతం నేర్చుకున్నారు. సంగీతజ్ఞుడైన తన తండ్రి హుసేన్‌బక్ష్‌ వద్ద కొంత సారంగీ కూడా అభ్యసించారు. మేరఠ్‌కు చెందిన ఉస్తాద్‌ మునీర్‌ఖాన్‌ తబలా వాయించడం విన్నాక అతనికి తబలామీద ఆసక్తి కలిగింది. మొదట తన బంధువులైన షేర్‌ఖాన్‌, ఫయ్యాజ్‌ఖాన్‌, బష్వాఖాన్‌ తదితరుల వద్ద అతను తబలా నేర్చుకున్నాక, తన పన్నెండో ఏట మునీర్‌ఖాన్‌ శిష్యుడుగా చేరారు. మధ్యమధ్యలో అరగంట విశ్రాంతి తీసుకుంటూ, ప్రతిరోజూ సుమారు 16 గంటలపాటు తబలా సాధన చేశారు. తన సోదరుడు మియాఁజాన్‌ సంరక్షణలో పెరిగిన అహ్మద్‌జాన్‌ రోజుకు గట్టిగా ఆరుగంటలు కూడా నిద్రపోకుండా, పాలు తాగుతూ, పుష్టికరమెన ఆహారం తింటూ, సంగీతం కోసం ఎంతగా శ్రమిస్తున్నా తన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకున్నారు. సంగీతం తప్ప మరే చింతలూ లేకుండా ఆయన తన యవ్వనమంతా గడిపారు. ఆరోగ్యంపట్ల ఉన్న క్రమశిక్షణే ఆయనకు తొంభై ఏళ్ళు దాటినా అద్భుతమైన సంగీతం వినిపించడానికి తోడ్పడింది. అలా జాగ్రత్తపడని బడేగులాం వంటి మహాగాయకులు 60 దాటగానే పక్షవాతం తదితర రుగ్మతలకు లోనై కాలం చేశారనేది విదితమే.
బాల్యంలో...
చిన్నవయసులోనే అహ్మద్‌జాన్‌ శ్రద్ధగా సాధన చేసే వైఖరి, నైపుణ్యం కారణంగా అతను మునీర్‌ఖాన్‌కు ప్రియశిష్యుడై పోయాడు. అతని నైపుణ్యాన్ని గమనిస్తున్న మునీర్‌ఖాన్‌ తండ్రి కాలేఖాన్‌కు అతని వేళ్ళు తబలా మీద కథక్‌నాట్యం చేస్తున్నట్టుగా అనిపించాయి. ఆ విధంగా అతనికి థిరక్వా అనే పేరు వచ్చింది. థిరక్వాది ఫరూఖాబాద్‌ సంప్రదాయానికి చెందిన లాలియానా బాణీ. ఈ శైలిలో వాయించే ఇతర తబలా కళాకారుల్లో అమీర్‌హుసేన్‌, (బడే గులాం అలీ ఖాన్‌, విలాయత్‌ఖాన్‌ తదితరులకు పక్క వాయిద్యం వాయించిన) నిజాముద్దీన్‌, గులాం హుసేన్‌, షమ్సుద్దీన్‌, నిఖిల్‌ఘోష్‌, గులాం రసూల్‌, నాగేశ్కర్‌ మొదలైనవారున్నారు.
16వ ఏట తొలి కచేరి
thirkwaపదహారో ఏట అహ్మద్‌జాన్‌ థిరక్వా బొంబాయిలో తొలిసారి కచేరీ చేసి పేరు సంపాదించుకున్నారు. సుప్రసిద్ధ మరాఠీ నట గాయకుడు బాలగంధర్వ కంపెనీలో కూడా తబలా వాయించి అందరి మెప్పునూ పొందారు. త్వరలోనే అతని ఖ్యాతి ఉత్తరభారతం అంతటా పెరిగింది. అతను ఎంతసేపు కచేరీ చేసినా వినేవారు ముగులై...అలా వింటూ ఉండిపోయేవారు. 1936లో అతన్ని రామ్‌పూర్‌ సంస్థానం దర్బారులో చేర్చుకున్నారు. రామ్‌పూర్‌ నవాబు రజా అలీఖాన్‌ మీద గౌరవం కొద్దీ నవాబుగారు చిడతలూ, గజ్జెలూ వాయించినప్పుడల్లా అతని వెంట థిరక్వా తబలా వాయించేవాడట! అక్కడ 30 ఏళ్ళపాటు అతను ఎందరో ప్రసిద్ధులకు తబలా సహకారం అందించాడు. ఆ తరవాత సంస్థానాలన్నీ రద్దయాక థిరక్వా లక్నోలోని భాత్‌ఖండే సంగీత కళాశాలలో తబలా విభాగానికి అధిపతిగా పనిచేసి, రిటెర్‌ అయిన తరవాత కూడా ఆ సంస్థకు సహకరిస్తూ వచ్చాడు.

దీర్ఘాయుష్షుతో అనేక దశాబ్దాలు సంగీతం వినిపించిన థిరక్వా రెండు యుగాలకు వారధిగా నిలిచాడు. మొదట సంగీత పోషకులుగా ఉండిన రాజాలు,నవాబుల ఆదరాన్ని చవిచూసిన ఈ విద్వాంసుడు దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ప్రజాస్వామ్యయుగంలో ప్రభుత్వం ద్వారా రేడియోలోనూ, పెద్ద సిటీల్లో మధ్యతరగతి సంగీతప్రియులు టికెట్లు కొని హాజరయ్యే పబ్లిక్‌ సంగీత కచేరీల్లో లభించే విశేష ప్రజాదరణను కూడా పొందగలిగారు. ఈ మార్పు ఆయనకు ఏమాత్రమూ ఇబ్బంది కలిగించకపోగా దానివల్ల ఆయన సంగీతానికి మరింత విస్తృతమైన ఖ్యాతి లభించింది. గొప్ప సంగీత జ్ఞానమూ,చెక్కుచెదరని గాంభీర్యమూ ఆయనకు సంగీత వృత్తిలో పేరుతెచ్చాయి.

ఆయన ప్రధానంగా సోలో కచేరీలే చేసినప్పటికీ, పాతతరం విద్వాంసులు అనేకమందికి తబలా సహకారం అందించారు. వారిలో అల్లాబందే ఖాన్‌,రజబ్‌అలీఖాన్‌, అల్లాదియాఖాన్‌, వహీద్‌ఖాన్‌, అల్లాఉద్దీన్‌ఖాన్‌, భాస్కరబువా బఖలే, ఫయ్యాజ్‌ఖాన్‌, ముష్టాక్‌హుసేన్‌, హాఫిజ్‌అలీ ఖాన్ ‌(నేటి సరోద్‌ విద్వాంసుడు అమ్జాద్‌ అలీఖాన్‌ తండ్రి), అలీఅక్బర్‌ఖాన్‌, రవిశంకర్‌, బిస్మిల్లాఖాన్‌, బేగంఅఖ్తర్‌, డాగర్‌ తదితరులున్నారు. చెదరని ఆత్మవిశ్వాసంతో తనకన్నా జూనియర్‌ కళాకారులకు తబలా వాయించడానికి కూడా ఆయన వెనకాడలేదు. పైగా ‘నాకులేని సంకోచం మీకెందుకు?’ అని ఆర్గనైజర్లతో అనేవాడట. ఆయన కచేరీ విన్నాక ప్రసిద్ధ మృదంగ విద్వాంసుడు పాల్ఘాట్‌ మణి అయ్యర్‌ ఆయనను సరస్వతీ అవతారమని పొగిడాడు.
థిరక్వా చాలా సంవత్సరాలపాటు లక్నో రేడియోలో తబలా వినిపించాడు. అనేక కచేరీల్లోనూ, సమావేశాల్లోనూ, సంగీతసభల్లోనూ ఆయనకు అపారమైన ఆదరణ, గౌరవమూ, పద్మభూషణ్‌ వంటి సన్మానాలూ లభించాయి. 1974 లో చివరిసారి ఆయన రేడియో సంగీత సమ్మేళనంలో కచేరీ చేశారు. వృద్ధాప్యంలో మాట్లాడేటప్పుడు ఆయన గొంతు వణికినా తబలా బోల్‌లు వినిపించేటప్పుడు మాత్రం ఆయన తొట్రుపడేవాడుకారు. ఆయన శిష్యుల్లో లాల్జీ గోఖలే, ప్రేమ్‌వల్లభ్‌, గులాం అహ్మద్‌, ఛోటా గోఖలే, నిఖిల్‌ఘోష్‌, అహ్మద్‌ అలీఖాన్‌, రామ్‌కుమార్‌శర్మ మొదలెన పేరుపొందిన తబలా విద్వాంసులున్నారు. సరైన పద్ధతిలో ఎడతెగని సాధనతో, వ్యాయామమూ, పౌష్టిక ఆహారంతో శిష్యులకు శిక్షణ నిచ్చాడాయన.
థిరక్వా గతకాలపు అనుభవాలను యువతరానికి వినిపిస్తూ ఉండేవారట.

అందరిలోకీ ఆగ్రా శైలి గాయకుడెన ఉస్తాద్‌ ఫయ్యాజ్‌ఖాన్‌కు పక్కవాయిద్యం వాయించడం తనకు తృప్తినిచ్చిందని ఆయన చెప్పారు. తాళంమీద గట్టి పట్టు ఉన్న ఆఫ్తాబే మూసికీ (సంగీత భాస్కరుడు) ఫయ్యాజ్‌ఖాన్‌కు కూడా థిరక్వా అంటే చాలా అభిమానం. కచేరీ మధ్యలో ఆయన వహ్వా...! థిరక్వా అనేవాడట. రజబ్‌అలీఖాన్‌ తన గానకచేరీల్లో పాడే వేగాన్ని పెంచేసి, తాను మాత్రం అలిసిపోకుండా తబలా వాయించేవారికి అలసట కలిగించి ఏడిపించేవారట. ఇది గమనించిన థిరక్వా అందుకు అనుగుణంగా తన తబలా లెక్కను మార్చేసి ఎంతసేపైనా వాయించడానికి సిద్ధపడేవారు. దీనికి రజబ్‌అలీ కోపగించక మెచ్చుకున్నారు. విమానం ఎక్కడానికి భయపడినందువల్లే విదేశాలకు ఎన్ని ఆహ్వానాలొచ్చినా వెళ్ళలేదనిచెప్పి థిరక్వా అందర్నీ నవ్వించేవారు.

98 ఏళ్ళు జీవించిన ఈ తబలా మాంత్రికుడు జనవరి 1976లో తాను నివసిస్తున్న బొంబాయినుంచి తన స్వస్థలమైన లక్నోకు వెళ్ళారు. తానెప్పటికీ లక్నోలోనే ఉంటాను అని మిత్రులకు మాట ఇచ్చినందువల్లనో ఏమో, మొహరం వెళ్ళిన కొద్ది రోజులకే లక్నోనుంచి బొంబాయికి రైలెక్కడానికి వెళుతూ రిక్షాలోనే ఆయన ప్రాణాలు వదిలారు. రాచరికపు దర్బారుల గౌరవాన్నీ, అసంఖ్యాకులైెన సామాన్య ప్రజల ఆదరాభిమానాలనీ కూడా చవిచూసిన ఆ మహావిద్వాంసుడి మరణంతో ఒక గొప్ప శకం ముగిసినట్టయింది.

క్యారికేచర్‌ : మూర్తిగారి మధు

Monday, November 8, 2010

వాఘా సరిహద్దుల్లో కన్నుల పండుగ జెండా పండుగ

Wagah_border_lahore‘‘దశాబ్దాల దాయాది వైరానికి భరతవాక్యం! శాంతిసారధి ఈ స్నేహవారధి... భారత పాకిస్తాన్‌ చర్చల్లో ఓ నూతనాధ్యాయం!... వాఘా సరిహద్దులో భారత ప్రధానికి పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ ఘన స్వాగతం...’’ ఇలా ఆనాడు ఏ వార్తా ప్రతిక చూసినా ఇవే కబుర్లు. 1999 ఫ్రిబవరి 20న ‘వాఘా సరిహద్దు’ వార్త ల్లోకెక్కింది. ఆనాడు భారత ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయి పాకిస్తాన్‌కు బస్సు ద్వారా శాంతియాత్రకు నాంది పలికారు. ఆనాడు భారత్‌లోని అమృతసర్‌- పాకిస్తాన్‌లోని లాహోర్‌ నడుమగల రోడ్‌ క్లిప్‌లైన్‌ను దాటి వెళ్ళిన మొట్టమొదటి భారత ప్రధానిగా వాజ్‌పేయి చరిత్ర సృష్టించారు.

బస్‌ దౌత్యం ద్వారా భారత పాక్‌ల మధ్య మూతబడివున్న భూ మార్గంతో పాటు దె్వైపాక్షిక సంబంధాలకు కూడా ఆనాడు వాజ్‌పేయి తలుపులు తెరిచారు. దేశ విభజన జరిగిన తర్వాత 1947 అక్టోబర్‌ 11వ తేదీన వాఘావద్ద నిర్మించిన ‘అడ్డు గోడ’ను వాజ్‌పేయి 1999 ఫిబ్రవరి 20న దాటారు. ఆనాటి నుండి వాఘా సరిహద్దు దేశప్రజలందరి దృష్టిలోకి వచ్చింది. అమృత్‌సర్‌కు 32 కి.మీ.లో దూరంలో ఉన్న అటారీ గ్రామంకి దగ్గర ఉందీ ‘వాఘా’ సరిహ ద్దు. ఇది అంతర్జాతీయ సరిహద్దు. భారతదేశానికి పాకిస్తాన్‌లోని లాహోర్‌ పట్టణానికీ మధ్య సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటల నుంచి 6.30 వరకూ ‘జండా పండుగ’ అద్భుతంగా జరుగుతుంది.

Wagah_border_lahore1వాఘా సరిహద్దు: పంజాబ్‌ రాష్ర్టంలోని అమృతసర్‌కు 32కి.మి దూరంలో ఉన్న ‘అటారి’ గ్రామానికి దగ్గరగా ఉంది ఈ వాఘా సరిహద్దు. ఇది అంతర్జాతీయ సరిహద్దు. భారతదేశానికి పాకిస్తాన్‌లోని లాహోర్‌ పట్టణానికీ మధ్య సరిహద్దు ప్రాంతం. ఇక్కడ ప్రతిరోజూ సాయంత్రం 6 గంటలకు జెండా ఉత్సవం అనే కార్యక్రమం చాలా అద్భుతంగా జరుగుతుంది. ప్రతి భారతీ యుడు చూడాల్సిన ఉత్సవం. ప్రతి రోజూ సాయం సంధ్యావేళ మనదేశం వైపు ‘భారత బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌’ (బిఎస్‌ఎఫ్‌ దళాలు), అటు పాకిస్థాన్‌ సోల్జర్స్‌ కలిసి జరిపే విన్యాసం ఒక అద్భుతం దృశ్యం. అటారీ గ్రామం నుండి వాఘా సరిహద్దు సుమారు 5 కి.మీ. ఉంటుంది. వెళ్లే రోడు్డి ఇరుపక్కలా పెద్దపెద్ద వృక్షాలు, పచ్చని గోధుమ పంట పొలాల్లో గాలికి ఊగే అద్భుత దృశ్యం. అలాగే రోడ్డు మధ్యలో బోర్డరులా రంగురంగుల పూలు మనకు ఆహ్లాదాన్ని స్తాయి.

మొత్తమ్మీద సాయం సమయంలో అస్తమిస్తు న్న సూర్యడు, చల్లని గాలులు, దారికిరు వైపులా పంటపొలాలు, వృక్షాల మీద పక్షులు గూటికి చేరిచే గోలగోలగా అరిచే అరుపులతో ఈ వాతావరణమంతా పరాటకులకు ఆహ్లాదాన్నిస్తాయి. ప్రకృతి ఆరాధకులకు గొప్ప ఆనందా న్ని పంచుతాయి.

ఈ సరిహద్దు ప్రాంతమంతా మన బిఎస్‌ఎఫ్‌ దళాలు అత్యంత జాగ్రత్తగా కాపలా కాస్తుంటా రు. ఎత్తు బురుజుల్లా ఉండే షెల్టర్లలో కూర్చుని చుట్టూ చూస్తూ ఉంటారు. ఇక ఆకాశంలో పాకిస్థాన్‌ నుండి ఎవరూ మనదేశంలోకి రాకుండా పహారాగా భద్రతా విమానాలు తిరుగుతూ ఉంటాయి. వాఘాకు వెళ్తుంటే ఒక మనం రక్షణ వలయంలో ఉన్నామనిపిస్తుంది. ఒక సరిహ ద్దు గేటు దగ్గరే మన జాతీయ మువ్వన్నెల జెండా గాలికి ఊగుతూ మనకు స్వాగతం పలుకు తుంది. బిఎస్‌ఎఫ్‌ దళాల గేటు దాటి లోపలికి వెళ్లగానే ఈజెండా ఉత్సవాన్ని చూడడానికి వచ్చే పర్యాటకులను మన దళాలు ఒక క్రమ పద్ధతిలో గ్యాలరీలో కూర్చోపెడతారు. సరిగ్గా సాయం త్రం 6గం టలకు భారత్‌- పాక్‌ సరిహద్దు గేట్లు తెరుచుకుంటాయి. ఆసమయంలో పాకిస్తాన్‌ గేటువైపు చూస్తే అక్కడ కూడా పాకిస్తాన్‌ పౌరులను చూడడము కూడా చక్కని అనుభూతినిస్తుంది. గేట్లు తెరుచుకోగానే భారత్‌, పాక్‌ సైన్యం తమ విన్యాసా లను జరుపుతారు. తరువాత ఇరు దేశాల జవాన్లు ఎరురెదురుగా నిలబడి నడుం మీ ద చేతులాన్చి నిలబడి కాళ్లను వేగంగా జాడిస్తూ విన్యాసాలు చేస్తారు. అలా ఇరుదేశా ల జవాన్లు చేసే కవాతు చూస్తుంటే మనకు గగుర్పాటు కలుగుతుంది. సంభ్రమాశ్చ ర్యాలలో మునిగిపోతాము. ఇలా జవాన్ల వివిధ విన్యాసాలతో తమ తమ దేశాల పతా కాలను అవనతం చేస్తారు. చాలా వినమ్రతతో ఆ పతాకాలను మడతపెట్టి ఎంతో గౌరవంగా మన జవాన్లు తీసుకెళ్తారు. దీంతో జెండా ఉత్సవం అయిపోతుంది.

పెల్లు బికే ఉత్సాహం... మొత్తంగా ఈ కార్యక్రమం సైనిక విన్యాసాలతో జాతీయ జెండాను తీసుకెళ్లడం వరకు ఆరగంట కాలం పడుతుంది. మన సైనిక విన్యాసాలను తిలకిస్తు న్న భారతీయుల్లో ఉత్సాహం, దేశాభిమానం, పెల్లుబికే చప్పట్లుతో ‘హమారా భారత్‌ మహాన్‌హై’ అంటూ పెద్దగా నినాదాలు చేస్తారు. ఈ అరుపులు, చప్పట్ల ధ్వనితో ఆ సంధ్యా సమయంలో గూళ్లకు చేరిన పక్షులు కూడా ఒక్కసారిగా అరుస్తూ గందర గోళంగా గాలిలోకి ఎగరడం చూస్తే ఆ చిన్న ప్రాణులు కూడా మనకు వత్తాసు పలు కుతున్నాయా! అనిపిస్తుంది. అక్కడి చెట్ల మధ్య నుంచి సూర్యాస్తమయ కాంతులు, పక్షుల కేరింతలు, యాత్రికుల ఉత్సాహం ఆ సంధ్యాసమయాన్ని చూసి ఆస్వాదించా లే కానీ వర్ణించడం అలవికాని పని. ఆ సమయంలో ప్రతి భారతీయుని హృదయం లో దేశాభిమానం ఉప్పొంగి ప్రవహిస్తుంది. అలాగే అటువైపు పాక్‌ ప్రజల ఆనందో త్సాహాలను కూడా చూస్తాం. వాఘా వెళ్లిన ప్రతి యాత్రికునికి ఇదొక అద్భుతమైన అనుభవం. ప్రతి భారతీయుడూ తప్పకుండా చూడాల్సిన పండుగ ఇది.

ఎలా వెళ్లాలి?: అమృత్‌సర్‌ నుండి 32 కి.మీ.లో ఉన్న అటారీ గ్రామానికి ఆ రాష్ట్ర ఆర్టీసి బస్సులో వెళ్లాలి. అక్కడి నుండి ఏదైనా వాహనంతో 5 కి.మీ. దూరంలో ఉన్న ‘వాఘా’ సరిహద్దుకు చేరాలి. లేదా సరాసరి అమృత్‌సర్‌ నుండి వాఘా దాకా ఏదైనా వాహనం తీసుకొనికూడా వెళ్లొచ్చు. అలాగే సంఝౌతా ఎక్స్‌ప్రెస్‌ ఢిల్లీ-లాహోర్‌ల మధ్య నడిచే రైల్వే సర్వీసు. వాఘా సరిహద్దుకు 5 కి.మీ. దూరంలోఉన్న అటారీ గ్రామం నుండి పాక్‌కు వెళ్తుందీ ట్రైన్‌. ఢిల్లీ నుంచి ఈ రైలులో అటారీ దాకా పర్యాట కులు రావచ్చు.
- దామర్ల విజయలక్ష్మి, అనంతపురం

జైహింద్! * పార్లమెంటులో ఒబామా నినాదం, అమెరికా అధ్యక్షుడి సుదీర్ఘ ప్రసంగం

భారత్ అభివృద్ధి చెందిన దేశం... ప్రపంచ చోదక శక్తి
ప్రపంచ నాయకత్వంలో సముచిత స్థానం దక్కాల్సిందే
భారత్‌కు శాశ్వత సభ్యత్వం గల భద్రతామండలి కోసం ఎదురుచూస్తున్నా
ప్రపంచ వేదికపైకి భారత్‌ను ఆహ్వానించటమే కాదు.. దానికి మద్దతు ఇస్తున్నాం
భారత్ తన మార్కెట్లను తెరవాలి..
పెట్టుబడులపై నిబంధనలను సరళీకరించాలి
అమెరికా కూడా హైటెక్ సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతులపై నిబంధనలను సరళం చేస్తుంది
భావి తరాల వారికి సుసంపన్నమైన, సురక్షితమైన ప్రపంచం కోసం నేటి తరం ఉమ్మడిగా కృషిచేయాలి
అగ్రరాజ్యం అమెరికా ‘కొత్త ప్రపంచ శక్తి’ భారత్ అంటూ జై కొట్టింది.

అనతికాలంలోనే అనూహ్య విజయాలు సాధించిన భారత్‌కు ప్రపంచ నాయకత్వంలో సముచిత స్థానం దక్కాల్సిందేనని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఇండియాకు శాశ్వత సభ్యత్వం కోసం ఎదురుచూస్తున్నానని భారత పార్లమెంటులో ప్రకటించారు. కేవలం పరస్పర ప్రయోజనాల కోసమే కాకుండా ప్రపంచ ప్రయోజనాల కోసం భారత్, అమెరికాలు ఉమ్మడిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రపంచాన్ని మరింత సుసంపన్నం చేయటం, ప్రపంచ శాంతిభద్రతలను పరిరక్షించటం, ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను పెంపొందించటం అనే మూడు రంగాల్లో అమెరికా-భారత్‌ల మధ్య సహకారం పెంపొందాలన్నారు. బర్మా వంటి దేశాల్లో ప్రజాస్వామ్యం, మానవ హక్కుల అంశాలను భారత్ విస్మరిస్తోందని చురకలు కూడా వేశారు.

న్యూఢిల్లీ: ఎన్నో భిన్నత్వాలు, ప్రతికూలతలు గల భారత్.. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూనే, విమర్శకుల అంచనాలను తారుమారు చేస్తూ కేవలం కొద్ది దశాబ్దాల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చోదక శక్తిగా ఎదిగిందని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కీర్తించారు. భారత సంస్కృతి విశిష్టతను, బలమైన ప్రజాస్వామ్యాన్ని కొనియాడారు. సోమవారం సాయంత్రం భారత పార్లమెంటులో ఉపరాష్టప్రతి హమీద్ అన్సారీ, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, యూపీఏ చైర్‌పర్సన్ సోనియాగాంధీలతో సహా లోక్‌సభ, రాజ్యసభ సభ్యులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒబామా ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...

‘‘ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్యానికి, వంద కోట్ల మందికి పైగా భారత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడేందుకు నాకు అందించిన ఈ గొప్ప గౌరవానికి కృతజ్ఞతలు. ప్రపంచంలో అతి పురాతన ప్రజాస్వామ్యమైన అమెరికా నుంచి, అందులోని ముప్పై లక్షల మంది దేశభక్తి గల భారత సంతతి అమెరికన్ల నుంచి శుభాకాంక్షలను, స్నేహాన్ని తెచ్చాను. గత మూడు రోజులుగా నేను, నా భార్య మిషెల్‌ను.. భారతదేశం, భారత ప్రజలు ఆత్మీయంగా ఆదరించారు. అందుకు మా కృతజ్ఞతలు స్వీకరించాల్సిందిగా కోరుతున్నాను. బహుత్ ధన్యవాద్!

భారత్ అభివృద్ధి చెందిన దేశం...

ఆసియాలో కానీ, ప్రపంచంలో కానీ భారత్ కేవలం అభివృద్ధి చెందుతున్న దేశం కాదు. భారత్ ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశం. అమెరికా, భారత్‌ల మధ్య ఉమ్మడి ప్రయోజనాలు, విలువలతో కూడిన సంబంధం 21వ శతాబ్దంలో నిర్ణయాత్మక భాగస్వామ్యమవుతుందన్నది నా గట్టి విశ్వాసం. ఈ భాగస్వామ్యాన్ని నిర్మించటం కోసమే నేను వచ్చాను. అంతులేని ప్రేమ, శాంతి సందేశాలను అందంచిన మీ జాతిపిత మహాత్మాగాంధీ వంటి వారితో భారత్ మా ఆలోచనలను విశాలం చేయటమే కాదు, మా నైతిక దృష్టినీ విస్తరింప జేసింది. నా జీవితం మొత్తంలో నేను గాంధీ నుంచి ఎంతో స్ఫూర్తి పొందాను. అమెరికాకు, ప్రపంచానికి గాంధీ సందేశం లేకుంటే.. నేనీ రోజు మీ ముందు అమెరికా అధ్యక్షుడిగా నిల్చుని ఉండేవాడిని కాదేమో.

మనం అవిభాజ్యం భాగస్వాములం...

సన్నిహిత సంబంధాలు గల భవిష్యత్ ప్రపంచాన్ని అమెరికా కోరుతోంది. ఈ స్వప్నాన్ని సాకారం చేయటంలో భారత్ ఒక అవిభాజ్య భాగస్వామి అని నేను ఎందుకు విశ్వసిస్తున్నానో ఈ రోజు చెప్పదలచుకున్నాను. మన దేశాల మధ్య సంబంధం విశిష్టమైనది. ‘మేము ప్రజలం’ అన్న ఒకే విప్లవాత్మక పదాలతో ప్రారంభమయ్యే రాజ్యాంగాలు గల రెండు బలమైన ప్రజాస్వామ్యాలు మనవి. రెండు గొప్ప గణతంత్రాలు మనవి. రెండు స్వేచ్ఛా వాణిజ్య ఆర్థిక వ్యవస్థలు మనవి. ఈ కారణంగానే.. ఈ నాటి సవాళ్లను పరిష్కరించటంలో భారత్, అమెరికాలు అవిభాజ్య భాగస్వాములని నేను విశ్వసిస్తున్నా. ఒక ఎదుగుతున్న ప్రపంచ శక్తిగా భారత్‌ను అమెరికా ఆహ్వానించటమే కాదు, దానికి చాలా బలంగా మద్దతునిస్తున్నాం. ప్రపంచంలో భారత్ తనకు తగిన స్థలాన్ని పొందుతున్న వేళ.. మన రెండు దేశాల మధ్య సంబంధాలను రాబోయే శతాబ్దానికి ఒక నిర్ణయాత్మక భాగస్వామ్యంగా మలచే చారిత్రక అవకాశం మనకు ఉంది.

మూడు ముఖ్యమైన రంగాల్లో కలిసి పనిచేయటం ద్వారా దీనిని సాకారం చేయగలమన్నది నా విశ్వాసం. ప్రపంచ భాగస్వాములుగా మన రెండు దేశాల్లో సుసంపన్నతను పెంపొందించుకోగలం. ఉన్నత సాంకేతిక, ఉన్నత వేతనాలు గల భవిష్యత్ ఉద్యోగాలను మనం సృష్టించగలం. నా పర్యటనతో మన పౌర అణు ఒప్పందాన్ని అమలు చేయటానికి మనం సిద్ధంగా ఉన్నాం. రక్షణ, పౌర అంతరిక్ష రంగాల్లో ఉన్నత సాంకేతిక భాగస్వామ్యాలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి.. మా ‘ఎంటిటీ (నిషిద్ధ) జాబితా’ నుంచి భారత సంస్థలను తొలగించాం. అలాగే ఎగుమతులపై మా నియంత్రణలను సంస్కరించేందుకు కూడా కృషిచేస్తాం. భారత్, అమెరికా పరిశోధకులు, శాస్తవ్రేత్తల మధ్య సహకారం.. హరిత విప్లవానికి నాంది పలికింది. ఇప్పుడు రైతులను సాధికారం చేయటానికి సాంకేతికతను ఉపయోగించటంలో భారత్ అగ్రస్థానంలో ఉంది. వ్యవసాయ ఉత్పాదకత, పరిశోధనల్లో అమెరికాది అగ్రస్థానం. మనం ఉమ్మడిగా రెండో సతత హరిత విప్లవానికి నాంది పలకవచ్చు.

ప్రపంచ భద్రతలో భాగస్వామ్యం...

భారత్, అమెరికాలు ఆసియాలో భాగస్వాములు కాగలవు. రెండు ప్రపంచ శక్తులుగా అమెరికా, భారత్‌లు ప్రపంచ భద్రతలో భాగస్వామ్యం పంచుకోగలవు. ప్రత్యేకించి రానున్న రెండేళ్లలో భారత్ ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సభ్యదేశంగా పనిచేయనున్న నేపథ్యంలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంది. నిజానికి.. సమర్థవంతమైన, విశ్వసనీయమైన, న్యాయబద్దమైన ఐక్యరాజ్యసమితి గల అంతర్జాతీయ క్రమాన్ని అమెరికా కోరుకుంటోంది. అందుకే.. రాబోయే సంవత్సరాల్లో భారత్ శాశ్వత సభ్యదేశంగా గల సంస్కరించిన భద్రతామండలిని నేను ఆకాంక్షిస్తున్నా. పెరిగిన శక్తితో బాధ్యత కూడా పెరుగుతుంది. శాంతిభద్రతలను పరిరక్షించటం, ప్రపంచ సహకారాన్ని పెంపొందించటం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లటం అన్న సిద్ధాంతాలను నెరవేర్చటం కోసం ఐక్యరాజ్య సమితి ఉంది. ఇవి అన్ని దేశాల, ప్రత్యేకించి 21వ శతాబ్దానికి నాయకత్వం వహించాలని కోరుకుంటున్న దేశాల బాధ్యతలు. అణ్వస్ర్తాల విస్తరణను అరికట్టటం కూడా అందులో ఒకటి.

ప్రజాస్వామ్య విలువల కోసం నిలబడాలి...

ప్రపంచంలో రెండు అతిగొప్ప ప్రజాస్వామ్య దేశాలు.. ఇతరుల స్వాతంత్య్రం కోసం కూడా మనం నిలబడాలన్న విషయాన్ని ఎన్నడూ మరువకూడదు. బర్మా వంటి దేశాల్లో జరిగినట్లుగా.. శాంతియుత ప్రజాస్వామ్య ఉద్యమాలను అణచివేసినప్పుడు.. ప్రపంచ ప్రజాస్వామ్య దేశాలు మౌనంగా ఉండజాలవు. మానవహక్కులను నిర్దాక్షిణ్యంగా ఉల్లంఘిస్తున్నపుడు.. దానిని ఖండిం చాల్సిన బాధ్యత అంతర్జాతీయ సమాజానిది. ప్రత్యేకించి అమెరికా, భారత్ వంటి అగ్ర దేశాలది. నిజాయితీగా చెప్పాలంటే.. భారత్ ఈ అంశాలను తరచుగా విస్మరించింది. తమ కోసం తాము మాట్లాడుకోలేని వారి తరఫున మాట్లాడటం.. ఇతర దేశాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం కాదు. అది సార్వభౌమ దేశాల హక్కులను ఉల్లంఘించటం కాదు. అది మన ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా నడుచుకోవటం. విశ్వజనీనమని మనం చెప్తున్న మానవ హక్కులకు అర్థాన్నివ్వటం.


మనం నిర్మించుకునేదే భవిష్యత్...

ఉమ్మడి సుసంపన్నతను పెంపొందించటం, శాంతిభద్రతలను పరిరక్షించటం, ప్రజాస్వామ్య పాలనను, మానవ హక్కులను బలోపేతం చేయటం అన్నవి నాయకత్వ బాధ్యతలు. ప్రపంచ భాగస్వాములుగా భారత్, అమెరికాలు 21వ శతాబ్దానికి అందించే నాయకత్వమిది. అన్నిటికీ మించి ఈ సంబంధం అధ్యక్షులు, ప్రధానమంత్రుల మధ్య ఉండేది కాదు. పార్లమెంటు మందిరాల్లో ఉండేది కాదు. మన ప్రజల మధ్య పెంపొందాల్సిన భాగస్వామ్యమిది. కాబట్టి భారత ప్రజలతో నేరుగా మాట్లాడి నా ప్రసంగాన్ని ముగించదలచుకున్నాను. ఇతర దేశాలకు శతాబ్దాలు పట్టిన అభివృద్ధిని, ప్రగతిని మీరు కేవలం కొన్ని దశాబ్దాల్లో సాధించారు. ఇప్పుడు మీరు ప్రపంచ దేశాల్లో ఒక న్యాయబద్ధమైన నాయకత్వ స్థానాన్ని అందుకుంటున్నారు. మీ తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు దీనిని ముందే ఊహించారు. మీ పిల్లలు, వారి పిల్లలు ఆ తర్వాత దీనిని తెలుసుకుంటారు. కానీ.. మీరు, ఈ తరం భారతీయులు ఈ క్షణాన్ని ఒడిసిపట్టుకోగలరు. మీరు కష్టపడి పనిచేస్తూ ముందుకు వెళ్తుంటే.. అమెరికా కేవలం ఓ పక్క నుంచి ఉత్సాహపరచటానికి పరిమితం కాబోదు.. మేం మీతో ఉంటాం, మీతో భుజం భుజం కలిపి సాగుతాం. డాక్టర్ అంబేద్కర్ వంటి దళితుడు తనకు తానుగా ముందుకుసాగి భారతీయులందరి హక్కులనూ పరిరక్షించే రాజ్యాంగాన్ని లిఖించినట్లుగా.. ప్రతి ఒక్కరూ దేవుడిచ్చిన సామర్థ్యాన్ని సాకారం చేసుకోగలరని నమ్ముతాం. ఎన్ని విభేదాలు ఉన్నప్పటికీ.. ప్రజలు ఒకరిలో మరొకరు తమను తాము చూసుకోగలరని, ఉమ్మడిగా పనిచేయగలరని, ఒక జాతిగా విజయం సాధించగలరన్నది భారత చరిత్ర. ఇది అమెరికా చరిత్ర. ఇది మన దేశాల మధ్య భాగస్వామ్యానికి స్ఫూర్తి కాగలదు. ఈ స్ఫూర్తితో మనం పనిచేస్తే.. నేటి మన తరం నిర్మించే మరింత సంపన్నమైన, మరింత భద్రమైన, మరింత ధర్మమైన ప్రపంచంలో భారత, అమెరికాల భవిష్యత్ తరాలు నివసిస్తాయి.

కృతజ్ఞతలు. జైహింద్!’’

Saturday, November 6, 2010

హలో.... ఇండియా * అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా

సతీసమేతుడై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మూడు రోజుల భారత పర్యటనకు ముంబయి చేరుకున్నారు. ఆయనకు ఘన స్వాగతం లభించింది. పాక్‌ ప్రస్తావన లేకుండానే ఉగ్రవాదంపై కళ్ళురిమారు. 26/11 ఉగ్రవాద బాధితులకు నివాళులర్పించారు. జాతిపిత మహాత్మాగాంధీ ప్రపంచానికే ఆదర్శమని ప్రవచించారు. అమెరికా భారత్‌ పరస్పర సహకారంపై తమదైన శైలిలో చెప్పదలచుకున్నది స్పష్టంగా చెప్పారు. ఉభయదేశాల మధ్య 44వేల కోట్లరూపాయలకు చేరిన వాణిజ్య బంధం మరింత పటిష్టం కావాలని ఆకాంక్షించారు. భారత్‌తో కుదిరిన వ్యాపారబంధంతో తమ దేశంలో 50 వేల ఉద్యోగాలకు కల్పిస్తామని అన్నారు.


obama3ముంబాయి: అమెరికా-భారత్‌ల మధ్య ప్రధాన లావాదేవీలు పది బిలియన్‌ అమెరికన్‌ డాలర్లకు ( దాదాపు రూ. 44,000 కోట్లు) చేరుకున్నాయని అధ్యక్షుడు బరాక్‌ ఒబామా శనివారం ప్రకటించారు. అమెరికాలో 50 వేల ఉద్యోగాల్ని కల్పిస్తామన్నారు. రెండుదేశాల మధ్య సంబంధాలు 21వ శతాబ్దానికే ఆదర్శంగా నిలుస్తాయన్న విశ్వాసముందని అమెరికా అధ్యక్షుడు తెలిపారు. పరస్పర సహకారం కోసం వ్యాపార పరమైన ఆటంకాల్ని తగ్గించవలసిందిగా ఆయన భారత్‌ను కోరారు.

నంబర్‌ వన్‌ భాగస్వామి ఎందుకు కాలేదు?
‘భారతదేశం మాతో వ్యాపారరంగంలో నంబర్‌ వన్‌ భాగస్వామి ఎందుకు కాలేకపోతోందో తెలీడంలేదు. అందుకు ఏ కారణమూ లేదు. (ఇప్పుడు అమెరికా వాణిజ్య భాగస్వాముల్లో ఇండియా 12వ స్థానంలో ఉంది. ఆ స్థానం మారడం లేదు), ఇండియా, అమెరికా మధ్య సంబంధాలు 21వ శతాబ్దంలోనే ఆదర్శ భాగస్వామ్యానికి నిర్వచనంగా నిలుస్తాయన్న నమ్మకం నాకుంది’ అని బరాక్‌ ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షుడైన తర్వాత మొదటిసారి మూడు రోజుల భారత్‌ పర్యటనకు వచ్చిన ఒబామా యూఎస్‌ ఇండియా బిజినెస్‌ కౌన్సిల్‌ (యూఎస్‌ఐబిసి) సమావేశంలో ప్రసంగించారు. ‘నేను ఇక్కడికి రావడానికి కొద్దిరోజుల కిందట అనేక కీలక లావాదేవీలు జరిగాయి. ఇండియాకు డజన్ల కొద్దీ విమానాల్ని అమ్మేందుకు బోయింగ్‌ సంస్థ సంసిద్ధత తెలిపింది. జిఇ కంపెనీ వందలాది ఎలక్ట్రిక్‌ ఇంజన్లను అమ్ముతుంది. ఈ లావాదేవీల విలువ పది బిలియన్‌ డాలర్లు...అంటే రూ 44 వేల కోట్లు. అలాగే అమెరికాలో 50 వేలకు పైగా ఉద్యోగాల్ని కల్పిస్తాం’ అని అమెరికా అధ్యక్షుడు ఒబామా ప్రకటించారు.

రిలయెన్స్‌ పవర్‌ ప్రకటన
obama4యుఎస్‌ఐబిసిలో ఒబామా ప్రసంగానికి కాస్త ముందుగా రిలియన్స్‌ పవర్‌ ఒక ప్రకటన చేసింది. 2400 మెగావాట్ల ప్లాంట్లకోసం జిఇ నుంచి విద్యుత్‌ పరికరాల కొనుగోలు ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నట్టు రిలయెన్స్‌ వెల్లడించింది. అలాగే బోయింగ్‌ సంస్థనుంచి 33 న్యూ జనరేషన్‌ 737 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకుంటామని లో కాస్ట్‌ కారియర్‌ సై్పస్‌జెట్‌ ప్రకటించింది.

మరింతగా పెట్టుబడులు
ఈ రెండు ఒప్పందాల గురించి తన ప్రసంగంలో ప్రస్తావిస్తూ ఒబామా - ‘ఇండియా సామర్థ్యాన్ని ఈ రెండు ఒప్పందాలూ చాటిచెబుతున్నాయి. భవిష్యత్తు మార్కెట్‌ ఇండియాదే. మార్కెట్‌ అస్థిరత, టారిఫ్‌ల వంటి అవరోధాలపట్ల జాగ్రత్త వహిస్తే అమెరికా తన పెట్టుబడులు పెంచేందుకు సిద్ధంగా ఉంది’ అని ఒబామా హామీ ఇచ్చారు. ఎగుమతులపై నిబంధనల్ని సడలిస్తే డిఆర్‌డిఓ, ఇస్రో వంటి భారతదేశ వ్యవస్థల ప్రవేశాన్ని సాంకేతికంగా తిరస్కరించడానికి తెరపడుతుందని అమెరికా అధ్యక్షుడు వ్యాఖ్యానించారు.

మహాత్ముడు ప్రపంచానికే హీరో
obama&gandhi శనివారం భారతదేశం చేరుకున్న అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా తనకు ప్రేరణనిచ్చిన మహాత్మాగాంధీ నివాసాన్ని సందర్శించారు. ‘మహాత్ముడు ప్రపంచానికే హీరో’ అని జాతిపితను శ్లాఘించారు. ‘నాకు ఆశను, ప్రేరణను ఇచ్చిన మహాత్ముడి జీవితానికి ప్రతీకలుగా ఉన్న వాటిని దర్శించడం నా భాగ్యంగా భావిస్తున్నాను. మహాత్ముడు భారతదేశానికి మాత్రమే జాతిపిత కాదు, ప్రపంచానికే హీరో’ అని ఒబామా మణిభవన్‌లో ఒక కప్‌ బోర్డుకు వేలాడదీసిన సందర్శకుల పుస్తకంలో రాశారు. ఆ వాక్యాలు రాస్తున్నప్పుడు ఆయన ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు. తన హీరో మహాత్ముడి నివాసానికి ఒబామా తన సతీమణి మిచెల్లీతో కలిసి వెళ్లారు. దక్షిణ ముంబాయిలో లాబర్నం రోడ్‌లో ఉన్న ఆ రెండంతస్తుల ఆ పురాతన భవనంలో అమెరికా అధ్యక్షుడు 45 నిముషాలు గడిపారు. ఇల్లంతా కలియతిరిగి చూశారు.

మహాత్ముడు బొంబాయి వచ్చినప్పుడు ఇక్కడే ఉండేవారు. మహాత్ముడి స్మారకచిహ్నాన్ని చూసిన అనుభూతిని తను ఎప్పటికీ మనసులో పదిలపరుచుకుంటానని ఒబామా భార్య మిచెల్లీ చెప్పారు. ఈ పర్యటనను తను ఒక అమూల్యమైన నిధిగా భావిస్తున్నానని అన్నారు. ‘గాంధీజీ జీవితం, బోధనల గురించి ప్రపంచవ్యాప్తంగా మన పిల్లలకు చెప్పాలి’ అని మిచెల్లీ సందర్శకుల పుస్తకంలో రాశారు. మణిభవన్‌ను ఇప్పుడు గాంధీ మ్యూజియంగా మార్చారు.

3 రోజుల పర్యటన 18 ప్రకటనలు
obama5ముంబాయి: అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా శనివారం సతీసమేతంగా భారతదేశం చేరుకున్నారు. ఆయన ఇక్కడ మూడు రోజులు పర్యటిస్తారు. ఆయన పర్యటన సందర్భంగా ఆర్థికరంగం, భద్రత, రాజకీయ రంగాలవంటి విస్తృతాంశాలపై 18 ప్రకటనలు వెలువడవచ్చని భావిస్తున్నారు. శాంతియుత, సైనిక ప్రయోజనాలకు సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతులపై ఆంక్షల్ని సడలించడం వంటి అంశాలు ఆ 18 ప్రకటనల్లో చోటుచేసుకోవచ్చు.ఇంతవరకు భారతదేశాన్ని సందర్శించిన అమెరికా అధ్యక్షుల్లో ఒబామా ఆరో వ్యక్తి. గత పదేళ్లలో ఇండియా వచ్చిన అమెరికా అధ్యక్షుల్లో ఈయన మూడోవారు.

శనివారం మధ్యాహ్నం సరిగ్గా 12 గంటల 50 నిముషాలకు ఒబామా, ఆయన భార్య మిచెల్లీ అమెరికా వైమానిక దళం విమానం నుంచి భారతభూమిపై కాలు మోపారు. ఆయన వెంట మంత్రివర్గ సహచరులు, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌ ( ఎన్‌ఎస్‌ఏ) టాం డోనిలన్‌, 200 మంది అమెరికా వ్యాపారవేత్తలు వచ్చారు. అమెరికా అధ్యక్షుడి వెంట వివిధ రంగాలకు చెందినవారు ఇంత పెద్ద సంఖ్యలో రావడం ఇదే మొదటిసారి.

సాదర స్వాగతం
obama1మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌, కేంద్ర మంత్రి సల్మాన్‌ ఖుర్షీద్‌, భారత్‌లో అమెరికా రాయబారి టిమోతీ రోమర్‌ , అమెరికాలో భారత రాయబారి మీరా శంకర్‌ ఒబామా దంపతులకు సాదరపూర్వకంగా స్వాగతం పలికారు. పరిచయ కార్యక్రమాలు, అభినందనలు పూర్తయిన తర్వాత ఒబామా దంపతులు తమకోసం సిద్ధంగా ఉన్న అమెరికన్‌ మెరైన్‌ వైపు నడిచి వెళ్లారు. అక్కడికి వచ్చిన జర్నలిస్టులు, ఫోటోగ్రాఫర్ల వైపు చూస్తూ ఒబామా పలకరింపుగా చేయి ఊపారు. ‘భారతదేశం సంపూర్ణ అభివృద్ధిని అధ్యక్షుడు కోరుకుంటున్నారు. ఇండియాతో సాధ్యమైనంత బలమైన, విస్తృతమైన సంబంధాల్ని ఏర్పరచుకోవడం మా ఆసియా విధానాల్లో ముఖ్యాంశం’ అని నేషనల్‌ సెక్యూరిటీ ఆడె్వైజర్‌ డోనిలన్‌ తెలిపారు. ‘వివిధరంగాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే ధోరణిలోనే కాక, విశ్వసనీయతను చాటే దాదాపు 18 ప్రకటనలు ఈ సందర్భంగా వెలువడతాయి’ అని డోనిలన్‌ చెప్పారు.

సంబంధాలు మెరుగైనాయి
ఇటీవలి సంవత్సరాల్లో భారతదేశంతో అమెరికా సంబంధాలు నాటకీయంగా మెరుగయ్యాయని అమెరికా ఉప విదేశాంగ మంత్రి విలియం బర్న్‌‌స చెప్పారు. 2008 నుంచి ఇండియాతో 400 కోట్ల డాలర్ల విలువైన రక్షణపరమైన అమ్మకాలు జరిగాయని ఆయన అన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌ అభివృద్ధికి ఇండియా 130 కోట్ల డాలర్ల సాయం అందించడాన్ని ఆయన ప్రశంసించారు. ‘భారత్‌ పాకిస్తాన్‌లు వివిధ అంశాలపై చర్చించుకోవాలని మేం పదేపదే కోరుకుంటున్నామన్నారు.

వీధి బాలలతో మిచెల్లీ ఆటాపాటా
obama2ముంబాయి: ఓవైపు అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ప్రముఖ భారత పారిశ్రామికవేత్తలతో వ్యాపార వ్యవహారాల గురించి సీరియస్‌గా చర్చిస్తుంటే, మరోవైపు ఆయన భార్య మిచెల్లీ ముంబాయి విశ్వవిద్యాలయం లైబ్రరీ వద్ద వీధి బాలలు, అనాథలతో మాట్లాడారు. ఆమిర్‌ఖాన్‌ సినిమా ‘రంగ్‌ దే బసంతి’లో హిట్‌ సాంగ్స్‌ బాణీలకు వారితో కలిసి నాట్యం చేశారు. మిచెల్లీ వారితో అరగంటసేపు ఆటపాటలతో గడిపారు. వారు జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు ఉత్సాహపరిచారు. అమెరికా అధ్యక్షుడి భారత్‌ పర్యటన సందర్భంగా శనివారం సాయంకాలం ముంబాయిలో కనిపించిన కమనీయ దృశ్యం ఇది. ‘నాకు డాన్స్‌ అంటే చాలా ఇష్టం. మీరు అదృష్టవంతులు. నాకూ ఇద్దరు పిల్లలున్నారు.

కష్టపడి పనిచేయడం, చదువుకోవడం, ధైర్యంగా ఉండడం జీవితంలో చాలా ముఖ్యం. నేను చాలా కష్టపడి చదువుకున్నాను. అమెరికాకు ప్రథమ మహిళ అవుతానని నేనెప్పుడూ అనుకోలేదు.కానీ నాకా అవకాశం వచ్చింది. అది చదువు వల్లే వచ్చింది. చదువుకుంటే మీరూ జీవితంలో విజయం సాధించగలరు’ మిచెల్లీ ఆ వీధి బాలలకు చెప్పారు. ఒక ఎన్‌జిఓ సంస్థ ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమం ఎంతో వైవిధ్యభరితంగా సాగింది.
ఒబామా.. వ్యాపార పర్యటన షురూ
obma-b అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా మూ డు రోజుల పర్యటన నిమిత్తం శనివారం దేశ ఆర్థిక రాజధాని ముంబయి చేరుకున్నారు. ఆశ్చర్యకరంగా ఆయన 10 బిలయన్‌ డాలర్లు (రూ.44,000) కోట్లు ఆర్డర్లు దక్కించుకున్నారు. ప్రధానంగా విమానయాన, విద్యుత్‌తో పాటు ఇతర రంగాలకు చెందిన ఆర్డర్లు కుప్ప లు తెప్పలుగా వచ్చి పడ్డాయి. ఈ ఒప్పందాలతో ఒబామా అమెరికాలో 50,000 ఉద్యోగాలు సృష్టించుకోవచ్చు. అయితే భారత్‌ నుంచి ఎగుమతలు తగ్గించుకొని, అమె రికా నుంచి ఎగుమతలు రెండింతలు చేసుకునే విధంగా ఒప్పందాలు చేసుకున్నారు. దీంతో రెండు దేశాల్లో కొత్తగా ఉద్యోగాలు సృష్టించుకోవచ్చునని ఆయన అన్నారు. భారత్‌ అమెరికాతో కలిసి భాగస్వామ్యం ఎందుకు కాకూ డదని ఆయన ప్రశ్నించారు. ప్రస్తుతం భారత్‌ వ్యాపార భాగస్వామిగా 12వ స్థానంలో ఉందన్నారు.

అమెరికాలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఒబామాకు ఎదురుగాలి వీచింది. వృద్ధి రేటు కుంటుపడింది. నిరుద్యోగం రేటు పెరిగిపోయింది. దీంతో అమెరికాలో తగ్గిన తన పలుకు బడిని పెంచుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. అమెరికన్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయని అన్నారు.

ఆయన భారత్‌ గడ్డపై కాలు మోపగానే ఆశ్చర్యకరంగా పలు ఒప్పందాలు జరిగిపోయాయి. వాటిలో స్పయిస్‌జెట్‌ చౌక రకం విమానయానసంస్థ బోయింగ్‌తో కమర్షియల్‌ విమానాల కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. జనరల్‌ ఎలక్ట్రిక్‌తో అడ్వాన్స్‌ జెట్‌ ఇంజన్‌ ఒప్పందం జరిగిపో యాయి. బోయింగ్‌ డజన్ల కొద్ది విమానాలు విక్రయి స్తుంది. జీఈ 100 కంటే ఎక్కువ ఎలక్ట్రిక్‌ ఇంజన్లు అందజేస్తుందని అన్నారు. ఆయన రాకముందే సుమారు 10 బిలియన్‌ డాలర్లు (రూ.44,000) కోట్ల ఒప్పందాలు జరిగిపోయాయి.
అమెరికా భారత్‌ బిజినెస్‌ కౌన్సిల్‌లో మాట్లాడుతూ ఒబామా అమెరికాలో ఎగుమతుల్లో భారత్‌ వాటా కేవంల 2 శాతమేనని అన్నారు.

ఇరుదేశాల ఆర్థిక వ్యవస్థలు బలపడే విధంగా చర్యలు తీసుకోవాలని ఒబామా అన్నారు. ఎగుమతుల నిబంధనలు సరళీకరించి టెక్నాలజీ రంగాల్లో కూడా పరస్పరం సహకరించు కోవాలని ఉదాహరణకు డీఆర్‌డీఓ, ఇస్రోకు కావాల్సిన సాంకేతికపరంగా ఉన్న అడ్డంకులను తొలగించాలని ఆయన చెప్పారు. భారత్‌ - అమెరికా వాణిజ్యం 2009-10 ఆర్థిక సంవత్సరంలో 36.5 బిలియన్‌ డాలర్లని, ఇరు దేశాలు ప్రస్తుతం ఉన్న వాణిజ్యాన్ని వచ్చే ఐదేళ్లలో రెండింతలు చేయాలని ఒబామా అన్నారు. భారత్‌ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 8 శాతం అమెరికా నుంచి పొందుతుందని, 21వ శతాబ్దంలో భారత్‌ తమ భాగస్వామి అన్నారు. వ్యవసాయ రంగంలో అమెరికా భారత్‌కు ఎంతో సహకరించిందని, అలాగే భారత్‌ కూడా అమెరికాకు పలు రంగాల్లో సహకరించిందన్నారు. ప్రపంచంలో ప్రస్తుతం భారత్‌ అభివృద్ధి పధంలో ముందుకు దూసుకుపోతుందని భారత్‌ గత రెండు దశాబ్దాల కాలంలో ఈ పురోగతిని సాధించిందని ఆయన ప్రశంసించారు. లైనెన్స్‌ రాజ్‌కు స్వస్తి పలికి, బహిరంగ మార్కెట్‌ విధానాన్ని భారత్‌ తెరలేపిందన్నారు.

ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా భారత్‌లో మధ్యతరగతి ఉందని, ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక శక్తిగా భారత్‌ ఎదుగుతోందని అన్నారు. రాబోయే రోజుల్లో భారత్‌ అమెరికాలో మరింత మెరుగైన వాణిజ్యం చేస్తుందని నమ్మకం ఉందన్నారు. త్వరలోనే భారత్‌ తమ వాణిజ్య భాగస్వామి అవుతుందని ఒబామా ఆశాభావం వ్యక్తం చేశారు.

Wednesday, November 3, 2010

మంచి స్నేహితులు దేవుడిచ్చిన వరాలు. * జీవితంలో ప్రతి మలుపులోనూ స్నేహితుల పాత్ర

ఓ పన్నెండుమంది కలిస్తే 'స్పెషల్ ఫ్రెండ్'

జీఎస్ఎస్ సంతోష్‌కుమార్‌కు చక్కటి స్నేహితులున్నారు. సినిమాలంటే అంతులేని ఆసక్తి ఉంది. పదో తరగతి నుంచే సినిమాలను శ్రద్ధగా చూడటం, క్షుణ్ణంగా విశ్లేషించడం అలవాటయింది. కొన్ని చిన్నాచితకావాటికి స్క్రీన్‌ప్లేలు రాసి, మరికొన్ని లఘు చిత్రాల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఇవన్నీ చాలుకదా, తానూ ఓ సినిమా తియ్యాలన్న కోరిక పుట్టడానికి. "మంచి స్నేహితులు దేవుడిచ్చిన వరాలు.

వాళ్లు మన కులం మతం కాకపోవచ్చు. కుటుంబసభ్యులసలే కాదు. కానీ అందరికన్నా మిన్నగా కష్టాలొచ్చినప్పుడు ఆదుకుంటారు, కన్నీళ్లను పంచుకుంటారు. ఆనందాన్ని రెట్టింపుచేస్తారు. విజయాలకు మురిసిపోతారు. జీవితంలో ప్రతి మలుపులోనూ స్నేహితుల పాత్ర అమోఘమైనది. అలాంటి స్నేహమే కథాంశంగా పూర్తి స్థాయి చిత్రాన్నెందుకు తియ్యకూడదు'' అనుకున్నాడు సంతోష్. అదీ ప్రారంభం.

మిత్రులే అన్నీ..
సినిమా విషయాల్లో తనకన్నా అనుభవం ఉన్న క్లాస్‌మేట్ హరిశంకర్‌తో కలిసి కథ, స్క్రీన్‌ప్లే పక్కాగా రాసుకున్నాడు సంతోష్. తాను చదువుతున్న అనిట్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఆడిషన్స్ నిర్వహించి కథలోని పాత్రలకు సరిపోయే విద్యార్థులను ఎంచుకున్నాడు. ఈ ప్రయత్నంలో తన కజిన్లు స్వాగత్, కార్తీక్ కలిసొచ్చారు. స్వాగత్ అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తే, కార్తీక్ మార్కెటింగ్ చూసుకున్నాడు. మరో పదిమంది స్నేహితులు తలో పనీ అందుకున్నారు. సతీశ్ ఎడిటింగ్ చేస్తే శశికాంత్, ప్రదీప్, కిరణ్, చైతన్య ప్రొడక్షన్ అసోసియేట్లుగా పనిచేశారు. శ్రీవల్లి, చాందినీ, నవీన్ డైలాగ్ అసిస్టెంట్లుగా పనిచేస్తే, ధీరజ్ ప్రోమో పాటగాడిగా గొంతు కలిపాడు.

ఇంజినీరింగ్ చివరి సంవత్సరం ప్రాజెక్టు వర్క్‌కిచ్చే సమయాన్ని ఉపయోగించుకున్నారు అందరూ. అంతా బానే ఉంది, మరి సినిమా తియ్యడానికి డబ్బు? తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించి తలాకొంత తెచ్చుకున్నారు. అలా రెండున్నర నెలల కాలం, లక్ష రూపాయల డబ్బూ ఖర్చయితే తయారైంది 'స్పెషల్ ఫ్రెండ్'. కథేమిటీ అంటే - అస్ట్రానమర్ కావాలని తపించిన బాల్యస్నేహితుడు ఆకాశ్‌ను కలవాలని ఎన్నో ఏళ్ల తర్వాత నగరానికి వస్తాడు దీపక్. అతణ్ని కలవడానికే ఇష్టపడని ఆకాశ్ ఇక స్నేహం ఏం చేస్తాడు? మిత్రుడికి ఉన్న దృష్టిలోపాన్ని సవరించడానికి, మళ్లీ తమ స్నేహాన్ని చిగురింపజెయ్యడానికి దీపక్ చేసిన ప్రయత్నాలే 'స్పెషల్ ఫ్రెండ్' సినిమా సారాంశం.

అందరికీ నచ్చుతుంది..
పూర్తిగా విద్యార్థులే నిర్మించిన మొదటి ఫీచర్ ఫిల్మ్ 'సిలికాన్ జంగిల్'. నాలుగేళ్ల క్రితం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో రూపొందిన ఆ సినిమా కొన్ని నగరాల్లో విడుదలయి యువ ప్రేక్షకుల ఆదరణకు నోచుకుంది. తమ సినిమాను కూడా అలా విడుదల చేసి ఎక్కువమంది ప్రేక్షకులకు దగ్గరవాలని విశాఖ విద్యార్థుల ఆలోచన. ప్రస్తుతానికి అందరూ చదువైపోయి ఉద్యోగాల్లో చేరడంతో కాస్త వెసులుబాటు చిక్కింది.

అయినా దేశవ్యాప్తంగా విడుదల చెయ్యడం తమ శక్తికి మించినదని తెలుసు వాళ్లకు. అందుకే ఇప్పుడు ప్రివ్యూ చూపించి స్పాన్సర్లను వెతికే పనిలో పడ్డారు. "సినిమా తీస్తున్నప్పుడు మాలో ఎవ్వరూ ఇదే చెయ్యాలి అని గిరి గీసుక్కూచోలేదు. మేమే లైట్ బోయిస్, మేమే యాక్టర్స్, మేమే డైరెక్టర్స్..'' అంటూ నవ్విన స్వాగత్ "మా సినిమా విద్యార్థుల భావోద్వేగాలకు అద్దం పడుతుంది. అందుకే వాళ్లకు బాగా నచ్చుతుంది. కనీసం కొన్ని ముఖ్య పట్టణాల్లో విడుదల చెయ్యాలని మా ఆలోచన'' అన్నాడు.

వారే పునాదిరాళ్లు
సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించిన సంతోష్‌ను కదిలిస్తే 'ఎన్నో పెద్ద భవనాలు నిర్మాణంలో ఉన్నప్పుడు చూడండి. భూమిని బాగుచెయ్యడం, పునాదులు తవ్వడం, స్తంభాలు పొయ్యడం వంటి పనులకు ఎక్కువ కాలం పడుతుంది. ఆ సమయంలో స్థలం చుట్టూ ప్లాస్టిక్ కవర్లు కట్టేస్తారు కనుక పునాదుల పని ఎంత జాగ్రత్తగా నడుస్తుందో గమనించే అవకాశం ఎవరికీ రాదు. ఒకసారి పునాది వేస్తే, ఆపై భవన నిర్మాణం శరవేగంతో పూర్తయిపోతుంది.

దారిన పోయేవారు పై అంతస్తుల పని ఎలా నడుస్తోందో చూడగలుగుతారు. సినిమా కూడా అచ్చం ఇలాంటిదే. ప్రేక్షకులు తెరపైన కనిపించే నటీనటులను, అందమైన దృశ్యాలను మాత్రమే చూస్తారు. హృద్యమైన సంగీతాన్ని వింటారు. అది పూర్తయిన భవనాన్ని చూడటం వంటి దే. అసలైన పునాది పని చేసేది టెక్నీషియన్స్. సినిమాకు సంబంధించిన సవాలక్ష పనులను సవ్యంగా చెయ్యడం, ఎంతోమంది కలిసి పనిచేసేలా చూడటం అన్నది కష్టం. ఆ శ్రమలో పాలుపంచుకున్న నా మిత్రులే నా బలం. అసలైన ఆర్కిటెక్టులు వాళ్లే..'' అన్న మాటల్లోనే సంతోష్ పరిణతి అర్థమవుతోంది. అంత అవగాహన ఉంటే ఇక సాధించలేనిది ఏముంటుంది?
- అరుణ పప్పు

Jai Ho .............